జీహెచ్ఎంసీ ఎన్నికల పోరులో జనసేన..

160
janasena
- Advertisement -

గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్‌ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిపిందే. ఈ మేరకు గ్రేటర్‌ ఎన్నికల పోరుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. యువ కార్యకర్తల విన్నపం మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పలు విన్నపాలు వచ్చాయని తెలిపారు. వారందరి విన్నపం మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని పార్టీ నేతలకు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశానని చెప్పారు.

తన వద్దకు వచ్చిన కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై చర్చించుకున్నారని పవన్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ, ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వారి అభీష్టానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను జనసేన నిలుపుతుందని చెప్పారు.

- Advertisement -