ముందస్తుకు సిద్ధమే…

173
Jana Sena Ready for Elections
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమపార్టీ సిద్దమేనని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  ‘ఎన్నికల యుద్ధం ఒకవేళ ముందస్తుగా వస్తే జన‘సేన’ సిద్ధమే’ అని శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.కాగా పవన్‌ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్‌ క్లారిటీ ఇచ్చారు.

కేంద్రం నుంచి ముందస్తు ఎన్నికల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకంటే ముందు జనసేన అధినేత స్పందించారు. ఇప్పటికే అనంతపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించిన పవన్ రాజకీయ వర్గాల్లో వేడిపుట్టించారు.అందుకు తగ్గట్టుగానే అనంతపురం నుంచి జనసైనికుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు.

- Advertisement -