అవతార్ 2 కలెక్షన్స్.. జేమ్స్ రియాక్షన్

54
- Advertisement -

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్‌2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో 4500 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లింది. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల్స్ చూస్తే అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం రూ. 20 కోట్ల పైనే ఉంటుందని అంచనా, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి రోజు రూ. 38 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సినిమా చూసి తమకు పరిచయం లేని అద్భుతమైన సముద్రపు గర్భంలోకి వెళ్లి, అక్కడి అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గొప్ప అనుభూతి చెందుతున్నారు ప్రేక్షకులు.

దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రంలో అడుగడుగునా గ్రేట్ విజువల్ ట్రీట్ ఇచ్చారు. నవతరం ప్రేక్షకుల సైతం ఈ చిత్రాన్ని చూసి మమైరిచిపోతున్నారు. ఇక అవతార్‌2 విజయంపై డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్ తాజాగా స్పందించారు. అవతార్ 2 కోసం చాలా ఆత్మపరిశీలన చేసుకొని.. కొన్నేళ్లు ఆలోచించి సీక్వెల్స్‌ తీయాలని నిర్ణయం తీసుకున్నానని జేమ్స్ చెప్పారు. “ప్రకృతితో మానవులకు ఉన్న సంబంధం చాలా గొప్పది. దానినే నేను అవతార్‌లో చూపించాను. సినిమా కోసం ఎంతో కష్టపడ్డా.. ధియేటర్లో చూసేటప్పుడు మా కష్టమంతా కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని ఎంతో పరిశీలించి ఆడియన్స్‌కు అందించాం”అని జేమ్స్ కామెరూన్ అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు సినీ లోకం అంతా అవతార్ 2 ను ఆదరిస్తోంది. కానీ అవతార్ 2 లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో పాటు గ్రేట్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మేం ఎంతగానో పరితప్పించాం. ఈ సినిమాలో గుడ్ ఎమోషన్స్ తో పాటు గుడ్ మెసేజ్ కూడా చెప్పాలి అనుకున్నాం. అది బాగా వర్కౌట్ అయింది’ అంటూ జేమ్స్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి…

ఇండస్ట్రీలో అశ్లీలత ఎక్కువైంది :ముఖేష్

పవన్ మరో రీమేక్

ప్రభాస్ ఎపిసోడ్ థియేటర్‌లోకి..?

- Advertisement -