హైదరాబాద్‌లో జైషా..

19
- Advertisement -

బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా హైదరాబాద్ చేరుకున్నారు. ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా. కొద్దిసేప‌టి కింద‌ట శంషాబాద్ విమానాశ్ర‌యంలో వీరికి స్వాగ‌తం ప‌లికారు హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు. సాయంత్రం హైద‌రాబాద్‌లోని ఒక హోట‌ల్ జ‌ర‌గ‌నున్న బీసీసీఐ అవార్డు వేడుక‌ల్లో పాల్గొన‌నున్న బీసీసీఐ ప్ర‌ముఖులు, ప‌లువురు క్రికెట్ దిగ్గ‌జాలు పాల్గొననున్నారు.

భారత్‌, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుండగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లోని ప్రారంభంకానుంది. ప్పటికే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, రాచకొండ పోలీసులు సమన్వయంతో భద్రత, పార్కింగ్‌, మిగతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ కూడా స్టార్ట్ చేశారు.

Also Read:కొడంగల్‌లో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ..

- Advertisement -