ఎన్టీఆర్ ..దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘జై లవ కుశ’ .. గతేడాది భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో చాలా స్పెషల్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతి సారి మంచి రేటింగ్స్ తెచ్చుకుంటూ ఉంటుంది. మొదటి సారి ట్రిపుల్ రోల్ చేసిన మూవీ కాబట్టి అభిమానులు కూడా ముగ్గురు ఎన్టీఆర్లను చూసుకుని మురిసిపోయారు. హీరో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించిన జై లవకుశకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.
‘జై లవ కుశ’కు ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో అరుదైన గౌరవం దక్కించుకుంది. నార్త్ కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో రెండు రోజుల ప్రదర్శనకు ఈ మూవీని ఎంపిక చేశారు. ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా ‘జై లవ కుశ’ కావడం విశేషం. ఎన్టీఆర్ అద్బుతమైన నటనతో మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం .. మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించడం .. పాత్రల్లోని వైవిధ్యం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. వీటితో పాటు దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.