ఏం చెబుతున్నాడు..!

229
Jagan To Roja..Caught on Cam
Jagan To Roja..Caught on Cam
- Advertisement -

2019లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. గుంటూరులో రెండురోజులపాటు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆపార్టీ ఎమ్మె్ల్యే రోజాకు జగన్‌ చేసిన సూచనలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తుంటే ప్లీనరీలో ఏపీ ప్రజల సమస్యలను చర్చించడం మానేసి కేవలం టీడీపీని టార్గెట్‌ చేసినట్టుగా తెలుస్తోందంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.

పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతుండగా మాట్లాడాల్సిందిగా నాయకులు రోజాను కోరారు.. రోజా వచ్చి మైకు తీసుకునే క్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. రోజాకు చెవిలో ఎదో చెబుతున్నాడు.. కానీ అది కాస్త మైక్‌లో స్పష్టంగా అక్కడున్నవాళ్లందరికి వినబడింది.. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ఆయన(జగన్‌) ఒకటికి పదిసార్లు చెబుతున్నాడు.. చంద్రబాబుని తిట్టమంటున్నాడు జాగ్రత్త.. ఇది మైక్‌లో పెద్దగా వినపడడంతో కార్యకర్తలంతా పెద్దగా అరిచారు.. రోజా కూడా నవ్వుతూ.. చంద్రబాబుపై పంచ్‌లేసింది.. టీడీపీ నేతలు.. చింతమనేని.. కామినేని.. దేవినేని.. అచ్చి.. బుచ్చి.. గాలి.. ధూలీ ఇలాంటి తోడేళ్లందరిని కాపాడుతున్న మహిళా ద్రోహీ ఈ చంద్రబాబు నాయుడంటూ.. ఈ రోజు నడిరోడ్డుపైనే బీచ్‌ షోలు.. బికినీ షోలకు తెగబడ్డ సిగ్గుమాలిన వ్యక్తులెవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే.. అది తెలుగు దేశం పార్టీ నాయకులే అని చెప్పొచ్చంటూ రోజా ప్రసగించారు..

https://youtu.be/QKtoV6Rbg60

- Advertisement -