దర్శకుడిగా మారిన కమెడియన్

185
- Advertisement -

తేజ దర్శకత్వంలో వచ్చిన జై అనే సినిమాతో కమెడియన్ గా పరిచయమైన వేణు టిల్లు అలియాస్ నల్ల వేణు తాజాగా మెగా ఫోన్ పట్టాడు. రెండేళ్ళుగా కామెడీ షోలకు అలాగే సినిమాలకు దూరంగా ఉంటూ దర్శకుడిగా గోల్డెన్ చాన్స్ కొట్టేశాడు. దిల్ రాజు బేనర్ నుండి డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నాడు వేణు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. తెలంగాణా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు బలగం అనే టైటిల్ పెట్టబోతున్నారని సమాచారం.

తాజాగా సాంగ్స్ షూట్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేశారు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు వేణుని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఈ సినిమా గురించి త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి. కమెడియన్ గా వేణు ఆశించిన స్థాయికి వెళ్ళలేదనే చెప్పాలి. మరి దర్శకుడిగా వేణు లక్ ఎలా ఉందో ? మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా హిట్ కొడతాడా చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఆ స్టార్ తో ‘రాధేశ్యామ్’ దర్శకుడు

పవన్ మూడు సినిమాలు ?

ప్చ్.. ఇలా పెంచేస్తే ఎలా అమ్మడు ?

- Advertisement -