శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ టీమ్ ..

143
Jabardasth-team-Tirumala
- Advertisement -

ఎమ్మెల్యే, జబర్ధస్త్ జడ్జి రోజాతో కలిసి జబర్దస్త్ టీమ్ గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది. క్వాలిటీ లోను, కంటెంట్ లోను జబర్దస్త్ ప్రత్యేకం. ఆ వేదిక నుండి ఎంతో మంది గొప్ప స్థాయికి ఎదిగారు. ఎందరో జీవితాల్లో జబర్దస్త్ వెలుగులు నింపింది. కాగా, ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే రోజ జడ్డిగా కనిపిస్తుంటారు. ఇక జబర్దస్త్‌లొ సుడిగాలి సుధీర్ టీం అంటే గుర్తు పట్టని వారు ఉండరు.

ముఖ్యంగా సుడిగాలి సుదీర్ టీంలో గెటప్ శ్రీను, సుధీర్, రామ్ రాంప్రసాద్ ముగ్గురు కలిసి ఉంటే ఇక ఆరోజు పొట్ట చెక్కలు కావలిసిందే. వీరు ముగ్గురు మొదటినుండి ఒకటి గానే ఉంటూ, ఒకటే టీంలో కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు మంచి స్నేహితులు. బుల్లితెరపై తమ మార్క్ కామెడీ టైమింగ్ ఏర్పాటు చేసుకున్న వీరు వెండితెరపై కూడా నవ్వులు పూయించారు. అంతేకాదు 3 మంకీస్ మూవీతో ఈ ముగ్గురు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -