ఎన్నో వివాదాల మధ్య బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్3 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించనుండగా బిగ్ బాస్ హౌజ్ 15మంది కంటెస్టెంట్ లను ఎంపిక చేశారు. గత రెండు సీజన్లను మించి ఈ మూడో సీజన్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కింగ్ నాగార్జున ఈసారి రంగంలోకి దిగారు.
తాజాగా బిగ్ బాస్ షో పై స్పందించారు జబర్దస్త్ కమెడీయన్ హైపర్ ఆది. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన హిమజకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఒక ఆర్టీస్ట్ గా పర్ఫెక్ట్ టైమింగ్ తో అందిరిని ఆకట్టుకున్న హిమజ రియాల్టీ షో కు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సినిమాల్లో రీల్ క్యారెక్టర్లో అందరి మనసులు గెలుచుకున్న మీరు బిగ్ బాస్ హౌజ్ లో కూడా అందరి మనసులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ కప్ హిమజ కు రావాలని కోరుకుంటున్నానని..అందరూ హిమజకు ఓటింగ్ వేసి గెలిపించాలని కోరారు.