‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్టులుక్..

110
Itlu Maredumilli Prajaneekam
- Advertisement -

అల్లరి నరేశ్ ‘నాందీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఆయన నటిస్తున్న సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. జీ స్టూడియోస్ వారితో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించగా, రాజమోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆనంది కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మంచం బుజాన పెట్టుకుని ఒంటి నిండా గాయాలతో అల్లరి నరేష్ కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇది సామాజిక అంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమని అర్థమవుతోంది. నాంది తర్వాత మళ్ళీ అలాంటి హిట్ ఈ సినిమాతో నరేశ్ ఖాతాలో చేరబోతుందని పోస్టర్‌తో తెలుస్తోంది. ఇక నరేశ్ హీరోగా పరిచయమై అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి అవడం విశేషం.

- Advertisement -