మంచు తుఫాన్లను దాటి..ఎవరెస్ట్‌ను ముద్దాడి!

6
- Advertisement -

హిమాలయాల్లో భారత మహిళల సాహసం చరిత్ర సృష్టించింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నిర్వహించిన తొలి ఆల్-వుమెన్ మౌంట్ ఎవరెస్ట్ యాత్ర విజయవంతమైంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ (8,848 మీటర్లు)ను 2026 మే 21న సౌత్ కోల్ మార్గం ద్వారా 11 మంది మహిళా పర్వతారోహకులు అధిరోహించారు. ఉదయం 6 గంటల 52 నిమిషాలకు తొలి సమ్మిట్ నమోదుకాగా, అనంతరం బృందంలోని అన్ని మహిళలు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు.

కఠిన వాతావరణ పరిస్థితులు, మంచు తుఫాన్లు, ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటూ భారత మహిళలు ఈ అరుదైన ఘనత సాధించడం దేశానికి గర్వకారణంగా మారింది. ఈ విజయంతో మహిళల సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పినట్లు ITBP అధికారులు తెలిపారు.

Also Read:త్వరలో మెడికల్/ఇంజనీరింగ్‌లకు ఒకే పరీక్ష

- Advertisement -