గల్లా జయదేవ్‌కు షాక్‌…

342
galla jayadev
- Advertisement -

ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి,టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లపై ఐటీ సోదాలు నిర్వహించిన అధికారులు తాజాగా గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్‌కు షాకిచ్చారు. గల్లా జయదేవ్ అకౌంటెంట్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అకౌంటెంట్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్న అధికారులు జయదేవ్‌ ఎన్నికల ఖర్చుల వివరాలతో పాటు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. తమను టార్గెట్‌గా చేసుకొని కేంద్రం ఐటీ దాడులకు దిగుతోందని వారు ఆరోపించారు.

2014లో గుంటూరు లోక్ సభ స్థానం బరిలో టీడీపీ నుంచి సినీ హీరో మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి పోటీ టఫ్‌గా మారింది. వైసీపీ నుంచి సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా, జనసేన నుండి జయదేవ్ స్నేహితుడైన బోనబోయన శ్రీనివాస్ బరిలో ఉన్నారు. దీంతో ఈసారి గుంటూరు స్ధానం ఎవరికి దక్కుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొనగా ఎన్నికలకు 24 గంటల ముందు గల్లాపై ఐటీ రైడ్స్ జరగడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -