భారీ భూకంపం కారణంగా మయన్మార్ దేశం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడగా లక్షలాదిమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భూకంపం కారణంగా జరిగిన నష్టంపై ఉపగ్రహ చిత్రాలను రిలీజ్ చేసింది.
ఇస్రో విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో భూకంపం కారణంగా సంభవించిన భారీ నష్టం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రకృతి వైపరీత్యం ప్రధానంగా మయన్మార్లోని రెండవ అతిపెద్ద నగరం మండలేలో భారీగా నష్టం సంభవించింది.
భూకంపం అనంతరం కార్టోసాట్-3 ఉపగ్రహం అందించిన చిత్రాలు నష్టంపై కీలకమైన సమాచారం అందించాయి. విడుదల చేసిన చిత్రాలలో ఇరవాడీ నదిపై ఉన్న భారీ వంతెన కూలిపోయిన దృశ్యాలు ఉన్నాయి. అలాగే, మండలే విశ్వవిద్యాలయం కూడా దెబ్బతిన్నట్లు స్పష్టమైంది.
ISRO’s Cartosat-3 images show damage caused by the Earthquake in Myanmar on 28 Mar 2025.https://t.co/px63Hqxmus pic.twitter.com/SEWP4THUNK
— Anshuman (TitaniumSV5) (@TitaniumSV5) March 31, 2025
Also Read:Gas Price:తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
ఈ భూకంపం వల్ల అనేక ప్రాంతాలలో భారీ నష్టం జరిగింది. వేలాది మంది గాయపడగా, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారులు, నివాస భవనాలు, చారిత్రక కట్టడాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ సంక్షోభ సమయంలో భారతదేశం సహాయాన్ని అందించిన మొదటి దేశాలలో ఒకటిగా నిలిచింది. భారత ప్రభుత్వ బృందాలు తక్షణమే మయన్మార్కు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

