Boyapati:బోయపాటి పనైపోయిందా?

36
- Advertisement -

మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీను తో నటించేందుకు ఎవరు ముందుకు రావడం లేదా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. హీరోలకు మితిమీరిన ఎలివేషన్స్ ఇవ్వడం బోయపాటి మేకింగ్ స్టైల్ ఇప్పుడదే ఆ డైరెక్టర్ కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. నటసింహ నందమూరి బాలకృష్ణతో చేసిన సినిమాలు తప్పా ఇతర హీరోలతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే అందుకు కారణం. ఇటీవల రామ్ పోతినేనితో చేసిన సినిమా స్కంద బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవడంతో బోయపాటితో నెక్స్ట్ మూవీ చేయడానికి హీరోలు వెనకడుగు వేస్తున్నట్లు టాక్. బోయపాటి నెక్స్ట్ మూవీని కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చేయనున్నట్లు ఆ మద్య వార్తలు వినిపించాయి. .

అయితే స్కంద ఫ్లాప్ తరువాత సూర్య ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్ట్ చూపడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బోయపాటి మూవీస్ లో ఉండే ఓవర్ మాస్ ఎలివేషన్స్ ఒక్క నటసింహ నందమూరి బాలకృష్ణకు మాత్రమే సెట్ అవుతాయని.. వేరే ఇతర హీరోలకు సెట్ కావని అందుకే బోయపాటి శ్రీను ఇతర హీరోలతో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయని చెబుతున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఒక్క అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు, రవితేజ తో తీసిన భద్ర మినహా ఎన్టీఆర్ తో తీసిన దమ్ము, బెల్లం కొండ శ్రీనివాస్ తో తీసిన ” జయ జానకి నాయక. రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ, లేటెస్ట్ గా రామ్ తో తీసిన స్కంద.. ఇలా ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. దీంతో బోయపాటి కంప్లీట్ గా తన మేకింగ్ స్టైల్ మార్చుకోకపోతే.. శ్రీను వైట్ల మాదిరి ఫెడ్ అవుట్ కావడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. మరి నెక్స్ట్ మూవీ తోనైనా బోయపాటి హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read:చరిత్ర సృష్టించిన భారత్..!

- Advertisement -