అనుష్క ప్రభాస్ కోసమే వచ్చిందా?

25
- Advertisement -

అనుష్క శెట్టి ఇప్పుడెక్కడుంది.. ఏం చేస్తోంది..? ఆమె చెన్నై లో ఉంది. ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతోంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ అనుష్క శెట్టి చెన్నైలో లేదు. అవును.. ఆమె మెరుపులా హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. రెండు రోజుల నుంచి సిటీలోనే ఉంది. మరి తాను నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ప్రమోషన్స్ లో మాత్రం అనుష్క ఎందుకు పాల్గొనలేదు ?. పైగా మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి భారీగానే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ఇప్పటివరకూ రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది అని టాక్.

అయినప్పటికీ అనుష్క శెట్టి మాత్రం తన సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోవడం లేదు. మరోవైపు రాజమౌళి ఫ్యామిలీ తో సరదాగా గడుపుతుందట. అలాగే ప్రభాస్ ను కూడా అనుష్క శెట్టి కలుసుకుంది అని టాక్. మొత్తమ్మీద అనుష్క శెట్టి – ప్రభాస్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతుంది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా కూడా ప్రభాస్ చెబితేనే అనుష్క శెట్టి చేసిందట. పైగా ప్రస్తుతం ప్రభాస్ కోసమే ఆమె హైదరాబాద్ కి వచ్చిందని తెలుస్తోంది. మరి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.

వారిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగిస్తోందని.. అనుష్క – ప్రభాస్ లు మంచి వ్యక్తులు అని.. వారి పై లేనిపోని పుకార్లు రాయొద్దు అంటూ అనుష్క కు చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఇచ్చిన సమాధానం ఇది. మొత్తానికి అనుష్క – ప్రభాస్ ప్రేమ వార్తలు ఇక ఎప్పటికీ ఆగుతాయో. అన్నట్టు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ మూవీలో నవీన్‌ పోలిశెట్టి కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌ బాగున్నాయి. అనుష్కకు కూడా ఈ చిత్రం మంచి కమ్‌ బ్యాక్‌ చిత్రంగా నిలిచింది.

Also Read:అరెస్ట్ : చంద్రబాబుకు ప్లేస్సా?మైనస్సా?

- Advertisement -