Allu Arjun:బన్నీ అక్కడ కొత్త ఇల్లు కొన్నారా?

99
- Advertisement -

ఇటీవల అల్లు అర్జున్ తరుచుగా ముంబై వెళ్తున్నారు. ఇక్కడ షూటింగ్ లేకపోతే అక్కడే ఉంటున్నారు. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డికు ముంబైలో ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. ఐతే, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి అక్కడ ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నారు అనే ప్రచారం మొదలైంది. బన్నీ, స్నేహ రెడ్డి ఇంతకుముందు ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ముంబైలో. ప్రస్తుతం హోటల్లోనే ఉంటున్నారట. తరుచుగా ముంబైకి వెళ్తున్నా అక్కడ వాళ్ళు ఇన్నాళ్లు ఇల్లు కొనుక్కోలేదు. కొనడం క్షణాల్లో పని. కానీ, అక్కడ స్థిరపడే ఆలోచన లేనప్పుడు ఎందుకు కొనడం అనుకున్నారు ఇన్నేళ్లు.

కాకపోతే, ఇప్పుడు వారి ఆలోచన మారింది. నిజానికి అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలకు హైదరాబాద్ లో కాకుండా చెన్నై, గోవాలో ఆస్తులు ఉన్నాయి. ఇక అల్లు కుటుంబానికి బెంగుళూరు సమీపంలో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ కూడా ఉంది. ఐతే, ముంబైలో మాత్రం ఇప్పటివరకు ఇల్లు కొనలేదు. పదేళ్ల క్రితం బన్నీ బాలీవుడ్ లో పలు యాడ్స్ చేశాడు. ఆ యాడ్స్ హిట్ అయినా, పుష్ప అద్భుత విజయాన్ని అందుకున్నా.. బన్నీ మాత్రం ముంబైలో ఇల్లు కొనాలి అని ఆలోచన చేయలేదు. ఐతే పుష్ప 2 తర్వాత హిందీలో కెరీర్ కంటిన్యూ చేద్దామనుకుంటున్నాడు బన్నీ.

అందుకే, ఈ టైంలోనే ముంబైలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. నిజానికి అదే ఇల్లును మొదట అద్దెకు తీసుకున్నారట. ఆ తర్వాత రెండు నెలలకి ఆ ఇల్లు బేరానికి వచ్చింది అని తెలిసి.. బన్నీ కొనుగోలు చేశాడు అని టాక్. మళ్ళీ ముంబై రాకపోకలు ఎక్కువ అయ్యాయి కాబట్టి, తమకంటూ ఓ ఇల్లు ఉండటమే బెటర్ అని బన్నీ ఫ్యామిలీ ఫీల్ అయ్యి ఉండొచ్చు.

Also Read:కాంగ్రెస్‌లోకి షర్మిల..ముహుర్తం ఫిక్స్

- Advertisement -