ఎంపీ సంతోష్‌కు విత్తన ఆహ్వాన పత్రిక అందజేత..

187
mp santhosh
- Advertisement -

ప్రకృతి ప్రేమికులు తమకున్న ప్రేమను వివిధ రూపాల్లో తెలియజేయడం జరుగుతుంది. నూతన యువ ఐఆర్ఎస్ అధికారి శశికాంత్ తన వివాహ ఆహ్వాన పత్రికను విత్తన పత్రిక రూపంలో తయారు చేపించి పంచారు. ఈ పత్రిక పేపర్ తో పాటు విత్తనాలు అందులోనే ఉండడం చేత మనకు మొక్క కావాల్సిన చోట దానిని నాటడం చేత మొక్క మొలకెత్తడం జరుగుతుంది.

ఈరోజు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి దాని యొక్క విశిష్టతను వివరించడం జరిగింది.ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాలాంటి ఎంతోమంది పకృతి ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది అని కొత్త ఆలోచనలకు రూపం ఇస్తుందని తెలియజేశారు.ఇంత మంచి ఆలోచన చేసి విత్తన వివాహ ఆహ్వాన పత్రిక తయారు చేయించిన యువ ఐఆర్ఎస్ అధికారి శశికాంత్ ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు అభినందించడం జరిగింది.

- Advertisement -