ఐపీఎల్ 13వ సీజన్ ఈ నెల 29 నుండి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. గత సీజన్లకు భిన్నంగా ఈసారి ప్రైజ్మనీని భారీగా తగ్గించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అన్ని ప్రాంఛైజీలకు తెలిపింది. ఇప్పటివరకు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ అందిస్తుండగా ఇకపై దానిని రూ. 10 కోట్లకు తగ్గించారు.
ఇక ఐపీఎల్ రన్నర్కు ఇప్పటివరకు రూ.12.5 కోట్లు ఇస్తుండగా ఇకపై రూ.6.25 కోట్లు ఇస్తామని బీసీసీఐ తెలిపింది. క్వాలిఫైయర్స్కు అర్హత సాధించిన రెండు జట్లకు రూ.4.37 కోట్లు అందించనున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంఛైజీలు మెరుగైన స్ధితిలో ఉండటమే కాదు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్పాన్సర్షిప్ లాంటి మార్గాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు.
మార్చి 29న తొలి మ్యాచ్ జరగనుండగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్కింగ్స్ తలపడనుంది. మే 24న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.