ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు రెండో విజయం నమోదు చేసింది. లక్నో విధించిన 172 పరుగుల టార్గెట్ను పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (69), శ్రేయస్ అయ్యర్ (52*) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది పంజాబ్. 23 బంతుల్లోనే ప్రభుసిమ్రన్ సింగ్ అర్థ సెంచరీ చేయడం విశేషం.
ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లో 44 పరుగులు చేయగా ఆయుష్ బదోని (41), అబ్దుల్ సమద్ (27), డేవిడ్ మిల్లర్ (19) పరుగులు చేశారు. ప్రభు సిమ్రన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఇక పంజాబ్ బ్యాట్స్మెన్ వధేరా కొట్టిన షాట్ సిక్స్ వెళ్లగా గ్రౌండ్ మ్యాన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
The
The CatchBoth approved by Ricky Ponting
Updates
https://t.co/j3IRkQFrAa #TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/XSuat7Wy1H
— IndianPremierLeague (@IPL) April 1, 2025
Also Read:HCU భూములను కాపాడాలి..అందరి బాధ్యత