IPL 2023:ఉత్కంఠ పోరులో లక్నో గెలుపు

52
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో గెలుపొందింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విధించిన 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. స్టాయినిస్ 65, పూరన్ 62, ఆయుష్ 30 పరుగులు రాణించడంతో లక్నో గెలుపొందింది. బెంగళూరు బౌలింగ్‌లో సిరాజ్ 3, పర్నెల్ 3, హర్షల్ 2, కర్ణ్ శర్మకు ఒక వికెట్ దక్కాయి.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(79; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లి(61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)ల‌తో పాటు వ‌న్ డౌన్ బ్యాట‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్(59; 29 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో లక్నో ముందు 213 భారీ ల‌క్ష్యం ఉంచింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -