IPL 2023:డిల్లీ vs ముంబై గెలిచేదెవ్వరు!

49
- Advertisement -

ఐపీఎల్ నేటి మ్యాచ్ లో డిల్లీ వర్సస్ ముబై జట్లు తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ముంబై ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోగా, డిల్లీ మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమి చవిచూసింది. దీంతో ఈ మ్యాచ్ లో గిలిచి మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఈ రెండు జట్లు 32 సార్లు తలపడగా.. అందులో డిల్లీ 17 సార్లు, ముంబై 15 సార్లు విజయాలను సొంతం చేసుకున్నాయి. .

ఇక ఇరు జట్ల బలబలాల విషయానికొస్తే.. డిల్లీలో డేవిడ్ వార్నర్, రోసో, పృద్వి షా వంటి హార్డ్ హిట్టర్స్ ఉన్నప్పటికి ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మరోవైపు ముంబైలో ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్ విభాగంలో ఇరు జట్ల బౌలర్స్ కూడా ధారాళంగా పరుగులిస్తూ ఘోరంగా విఫలం అవుతున్నారు. దీంతో అటు డిల్లీ, ఇటు ముంబై ఈ మ్యాచ్ తో ఎలాగైనా ఫామ్ లోకి వచ్చి మొదటి విజయాన్ని నమోదు చేసుకోవాలని చూస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఇరు జట్ల గణాంకాలు పరిశీలిస్తే డిల్లీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మ్యాచ్ గెలవకపోతే ఇక రాబోయే మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఓడిపోయిన జట్టు పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచే ప్రమాదం ఉంది మరి ఇరు జట్లకు కిలకంగా మారిన ఈ మ్యాచ్ లో ఏ జట్టు పై చేయి సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -