IPL2023:చెన్నై ముందు ‘సన్ రైజర్స్ ‘ నిలిచేనా?

39
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ లో మరో ఆసక్తికరమైన ఫైట్ జరగనుంది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరబాద్ తలపడనుంది. రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్.. చిదంబరం స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన 5 మ్యాచ్ లలో మూడు విజయాలు సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్ లో భారీ స్కోర్ నమోదు చేసి అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. .

ఇక గత మ్యాచ్ ఇచ్చిన జోష్ తో ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో సన్ రైజర్స్ హైదరబాద్ తో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ప్లేయర్స్ కూడా అద్బుతమైన ఫామ్ లో ఉండడం చెన్నై కి కలిసొచ్చే అంశం. రుతురాజ్ గైక్వర్డ్, కాన్వే, దూబే వంటి విధ్వంసకర బ్యాట్స్ మెన్స్ ఆ జట్టు సొంతం. ఇక ధోని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చేపప్వలసిన అవసరం లేదు. దాంతో చెన్నై ని ఎదుర్కోవడం సన్ రైజర్స్ కు అంతా ఈజీ కాదు. మరోవైపు ముంబై తో జరిగిన గత మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి చవి చూసింది.

Also Read:వేసవిలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలా..ఇలా చేయండి !

దాంతో చెన్నైపై ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం లో నిలవాలని సన్ రైజర్స్ జట్టు చూస్తోంది. బౌలింగ్ విషయంలో అత్యంత పటిష్టంగా ఉన్న సన్ రైజర్స్.. బ్యాటింగ్ లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. బ్రూట్, త్రిపాటి, జాన్సన్ వంటి ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే .హైదరబాద్ జట్టుకు తిరుగుండదు. మరి చెన్నై, హైదరబాద్ మద్య జరిగే ఈ ఆసక్తికరమైన ఫైట్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. ఇక నిన్న జరిగిన డబుల్ ధమాకా మ్యాచ్ లలో పంజాబ్ పై బెంగళూరు విజయం సాధించగా, కోల్ కతా పై డిల్లీ విజయం సాధించింది. ఈ సీజన్ లో డిల్లీ క్యాపిటల్స్ కు ఇదే మొదటి విజయం కావడం గమనార్హం.

Also Read:బీజేపీలో మార్పు జరుగుతోందా ?

- Advertisement -