IPL 2023:ఢిల్లీపై చెన్నై ఘన విజయం

49
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీపై ఘన విజయం సాధించింది చెన్నై. 168 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ 8 వికెట్లు కొల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 27 పరుగుల తేడాతో ఢిల్లీపై చెన్నై గెలుపొందింది. రిలీ రోసో(35), మ‌నీష్ పాండే(27), అక్ష‌ర్ ప‌టేల్‌(21) ప‌ర్వాలేద‌నిపించ‌గా డేవిడ్ వార్న‌ర్‌(0), మిచెల్ మార్ష్(5), సాల్ట్‌(17)లు విఫ‌లం అయ్యారు.

Also Read:కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ జూలైలో విడుదల

ఇక అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేసింది. రుతురాత్‌(24), ర‌హానే(21), దూబే (25), రాయుడు(23), జ‌డేజా(21) పరుగులు చేశారు. చివర్లో ధోని(20; 9 బంతుల్లో 1ఫోర్‌, 2 సిక్స్‌లు) చేయడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్ రెండు, ఖ‌లీల్ అహ్మ‌ద్‌, ల‌లిత్ యాద‌వ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Also Read:ఎగ్జిట్ పోల్స్ : సంచలనం.. విజయం ఆ పార్టీదే !

- Advertisement -