ఐపీఎల్‌ 2021…రెండు కొత్త టీమ్‌లు!

492
ipl
- Advertisement -

ఐపీఎల్ 2020 దుబాయ్ వేదికగా విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ 2021 కోసం అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఈసారి రెండు కొత్త టీమ్‌లు ఎంటర్‌కానున్నాయి.

డిసెంబ‌ర్ 24న జ‌ర‌గబోయే వార్షిక సర్వ‌సభ్య స‌మావేశంలో బీసీసీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్ప‌టికే రెండు కొత్త టీమ్స్ కోసం పూర్తి స్థాయి వేలానికి సిద్ధంగా ఉండాల‌ని అన్ని ఫ్రాంచైజీల‌కు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ సందేశం పంపించారు. వ‌చ్చే ఏడాది మొద‌ట్లోనే ఈ వేలం ఉండే అవ‌కాశం ఉంది.

ఈ రెండు టీమ్‌లలో ఒక టీమ్ క‌చ్చితంగా అహ్మ‌దాబాద్ నుంచి ఉంటుంద‌ని ఇ… ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా మారిన మొతెరానే ఈ టీమ్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉంటుంద‌నీ వార్తలు వెలువడగా మ‌రోవైపు కొత్త టీమ్ కోసం మోహ‌న్‌లాల్‌, స‌ల్మాన్ ఖాన్ కూడా పోటీ ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదిఏమైనా ఈసారి 2021 ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా ఉండనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -