నా క‌ల నిజ‌మైంది- సీజేఐ ఎన్వీ రమణ

129
CJI NV Ramana
- Advertisement -

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అంత‌ర్జాతీయ వాణిజ్య వివాదాల మ‌ధ్య‌వ‌ర్తుల కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఆ సెంట‌ర్‌కు చెందిన ట్ర‌స్ట్ డీడ్ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఎలాంటి వివాదాలు లేని వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుంటారని,ఏ వివాదాలు లేకుండా ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం చూస్తుందని చీఫ్ జస్టిస్ చెప్పారు.

ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం జరగడం తెలంగాణకు చారిత్రక ఘట్టం అని అన్నారు. నేను కన్న కల మూడు నెలల్లోనే తీరడం ఆనందదాయకమన్నారు. ఇక్కడ మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆర్బిట్రేషన్ కేంద్ర ఏర్పాటు బాధ్యతలను లావు నాగేశ్వరరావు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు చట్టం వచ్చిందని గుర్తు చేశారు.

ప్రపంచంలో తొలిసారిగా 1926లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందని చెప్పారు. అయితే, మన దగ్గర ఆర్బిట్రేషన్ కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిసారీ సింగపూర్, దుబాయ్‌కి వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆ బాధ తప్పుతుందన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నారు. త‌న క‌ల నిజ‌మ‌య్యేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీజే హిమా కోహ్లీకి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ థ్యాంక్స్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

- Advertisement -