న్యూజిలాండ్ టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే..

97
- Advertisement -

ఈ నెల 25 నుంచి భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించింది. అజింక్యా ర‌హానే కెప్టెన్‌గా, పుజారా వైఎస్ కెప్టెన్‌గా భార‌త్ తొలి టెస్టు ఆడ‌నున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. రెండో టెస్టులో కోహ్లీ ఆడ‌తాడ‌ని, జ‌ట్టుకి సార‌థిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాడ‌ని బీసీసీఐ వెల్లడించింది.

భారత జట్టు: కేఎల్ రాహుల్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్, శుభ్‌మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్య‌ర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీప‌ర్), కేఎస్ భ‌ర‌త్ (వికెట్ కీప‌ర్), ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, అక్షర్ పటేల్, జ‌యంత్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేశ్ యాద‌వ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ టీమిండియా స్క్వాడ్ లో ఉన్నారు.

- Advertisement -