Paris Olympics:సెమీస్‌లో భారత హాకీ జట్టు ఓటమి

6
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు సెమీస్‌లో ఓటమి పాలైంది. భారా ఆశలతో బరిలోకి దిగిన భారత జట్టు.. జర్మనీతో జరిగిన సెమీ ఫైనల్‌ పోరులో 3-2 తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో బంగారు పతకం పతకం ఆశలను మిస్ చేసుకున్న కాంస్యం కోసం జరిగే పోరులో తలపడనుంది.గెలుపు కోసం చివరి వరకు పోరాడింది భారత జట్టు.ముఖ్యంగా గోల్ కోసం చివరి 5 నిమిషాల్లో భారత ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ జర్మనీ వశమైంది.

అయితే రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్‌మాన్‌తో జరిగిన బౌట్‌లో 5-0తో విజయం సాధించింది. స్వర్ణ కోసం జరిగే ఫైనల్‌ పోరులో అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో వినేశ్ ఫొగట్ తలపడనుంది.

Also Read:లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -