వాళ్ళిద్దరికీ రుణపడి ఉంటా..పంత్‌ ట్వీట్‌

109
- Advertisement -

ముంబైలో చికిత్స తీసుకుంటున్న భారత క్రికెటర్‌ రిషభ్ పంత్ కోలుకుంటున్నట్టు ప్రమాదం తర్వాత ట్విటర్ ద్వారా స్పందించారు. గత నెల 30న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌ను బస్సు డ్రైవర్ కండక్టర్ కాపాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజత్ కుమార్ నిషూ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నాకు సహకరించిన వాళ్లకు ప్రార్థించిన వాళ్లందరికీ ధన్యవాదాలు నాసర్జరీ విజయవంతంగా పూర్తైందని…ప్రమాదం నుంచి కోలుకుంటున్నట్టు ప్రకటించారు.

నా అభిమానులు సన్నిహితులు తోటి ఆటగాళ్లు డాక్టర్లు బీసీసీఐ.. అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను అని రిషభ్‌ పంత్ ట్వీట్ చేశారు. త్వరలో అందరినీ మైదానంలో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. రిషభ్ పంత్‌ను తొలుత డెహ్రడూన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందగా…మెరుగైన చికిత్స కోసం బీసీసీఐ ముంబైలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

తారక్‌తో భారత ఆటగాళ్ల సందడి!

ఉప్పల్​లో రోహిత్ సేన..

వేగాన్‌గా మారిన కోహ్లీ ఎప్పుడంటే…

- Advertisement -