శ్రీలంకతో జరిగే టెస్టు మ్యాచ్లలో భారత బ్యాటర్ల ప్రదర్శన ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీలంక బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని అత్యధిక పరుగులు సాధించిన భారత దిగ్గజాల జాబితాను పరిశీలిస్తే, అందులో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రథమ స్థానంలో ఉన్నారు.
సచిన్ టెండూల్కర్..మొత్తం పరుగులు: 1,995.ఇన్నింగ్స్లు: 36,సగటు: 60.45 కాగా ఇందులో 9 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
శిఖర్ ధావన్ మొత్తం పరుగులు: 1,672..ఇన్నింగ్స్లు: 28కాగా సగటు: 64.30గా ఉండగా ఇందులో ఆరు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రాహుల్ ద్రవిడ్ ..మొత్తం పరుగులు: 1,508..ఇన్నింగ్స్లు: 32…సగటు: 48.64 కాగా 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ..మొత్తం పరుగులు: 1,085 పరుగులు కాగా ఇన్నింగ్స్లు: 15.. సగటు: 72.33 కాగా 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read:వారంతా ఇప్పుడు దేశద్రోహులా?
వీరేందర్ సెహ్వాగ్ ..మొత్తం పరుగులు: 1,028..ఇన్నింగ్స్లు: 18..సగటు: 60.47 కాగా ఇందులో 5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక స్పిన్, పేస్ బౌలింగ్లను ఎదుర్కొని ఈ దిగ్గజ బ్యాటర్లు సాధించిన ఈ రికార్డులు భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోయాయి.

