ఒకే ఒక్క త్రో…మ్యాచ్‌ను మలుపు తిప్పింది

1519
- Advertisement -

ఆడిలైడ్‌ వేదికగా జరిగిన సూపర్‌ 12లో మ్యాచ్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌ల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. 185 పరుగుల భారీ లక్ష్యంతో చేధనకు దిగిన బంగ్లా ఓపెనర్‌లు తొలి వికెట్‌కు(68) భాగస్వామ్యంతో జట్టును విజయాతీరాలకు చేర్చాలనుకున్నారు. కానీ రాహుల్‌ రూపంలో లిటన్‌ బ్యాటర్‌ ఔట్‌ అయ్యాడు.

అశ్విన్‌ బౌలింగ్‌లో నజ్ముల్‌ షాంటో బంతిని డీప్‌మిడ్‌ వికెట్‌ వైపు తరలించాడు. రెండో పరుగు తీసేందుకు బ్యాటర్లు ప్రయత్నించగా…భారత ఫీల్డర్ కేఎల్‌ రాహుల్‌ నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ వైపు బంతిని వికెట్ల వైపు విసిరాడు. దీంతో లిటన్‌ దాస్‌ పెవిలియన్‌కు వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన ఆ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి..

మూడో విజయం నమోదు చేసుకున్న భారత్‌

టీ20లోనెంబర్‌వన్‌ సూర్య భాయ్‌

పదిలో పదకొండు కాదు..ఆరు పేపర్లు

- Advertisement -