రోహిత్..డబుల్ సెంచరీ మిస్

438
rohit
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పరుగుల మోత మోగిస్తోంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొలి రోజే శతకం చేయగా, రెండో రోజు మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సైతం సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 176 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. 89 ఓవ‌ర్ల‌లో భార‌త్ రెండు వికెట్లు కోల్పోయి 324 ర‌న్స్ చేసింది.

mayank

మ‌రో ఓపెనర్ మ‌యాంక్ 138 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అగ‌ర్వాల్‌కు ఇది టెస్టుల్లో తొలి సెంచ‌రీ. మ‌యాంక్ సెంచ‌రీలో 13 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. లంచ్ త‌ర్వాత మొద‌టి బంతికే పుజారా ఔట‌య్యాడు. పుజారా ఆరు ర‌న్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -