ఆసీస్‌తో టీ20..కోహ్లీ సేన ఇదే

239
kohli vs warner
- Advertisement -

ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ సేన సిద్ధమైంది. ఇప్పటికే ప్రాక్టిస్‌ను ముమ్మరం చేసిన భారత్‌..టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది. బ్రిస్బేన్ వేదికగా నవంబర్ 21న జరిగే తొలి టీ20 జరగనుంది.

ఈ మ్యాచ్ కోసం 12 మంది ప్లేయర్స్ తో టీంను సెలెక్ట్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. టీ20ల నుంచి మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతినివ్వ‌డంతో యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్‌కు కీపర్ గా చాన్స్ ఇచ్చారు. అదేవిధంగా వెస్టిండీస్ సిరీస్‌ సందర్భంగా విశ్రాంతి తీసుకున్న కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు.

టీమిండియా టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్.

- Advertisement -