గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప..

139
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంపై ఎంపీ సంతోష్ చెంగప్పకి వివరించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చెట్ల పెంపకంపై నిర్వహిస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై చెంగప్ప హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇండియా గేట్ సమీపంలోని పండార పార్కులో జామ మొక్కను నాటి తన వంతుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతగానో దోహద పడుతుందని ఇలాంటి కార్యక్రమాలో స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలని ఇండియా టుడే ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అభిప్రాయబడ్డారు. భారతదేశం అంతటా రాబోయే రోజుల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు పెంపకం చేపట్టేందుకు తనవంతుగా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు అన్నారు.

- Advertisement -