దేశంలో కొత్తగా 50,040 క‌రోనా కేసులు..

165
India Coron Cases
- Advertisement -

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 50,040 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం.. 24 గంట‌ల్లో 57,944 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది.ఇక మరణాల విషయానికొస్తే, గత 24 గంటల్లో 1,258 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,95,751 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,92,51,029 మంది కోలుకున్నారు. 5,86,403 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగిందని తెలిపింది.

- Advertisement -