దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదు..

79
covid
- Advertisement -

ఇండియాలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గు ముఖం పడుతోంది. దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 3,40,60,774 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,73,326 మంది కరోనాకు బలవగా, 99,155 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కొత్తగా 2,796 మంది మరణించగా, 6,918 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కరోనా రికవరీరేటు 98.35 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.29 శాతం అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,27,61,83,065 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

- Advertisement -