దేశంలో కొత్త‌గా 60,471 కరోనా కేసుల నమోదు..

253
India Corona cases
- Advertisement -

భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 60,471 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం… కొత్తగా 1,17,525 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. మరో 2,726 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,77,031కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,82,80,472 మంది కోలుకున్నారు. 9,13,378 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,90,44,072 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -