దేశంలో కొత్తగా 30,757 క‌రోనా కేసులు నమోదు..

60
- Advertisement -

భారత్‌ కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24గంటల్లో 30,757 క‌రోనా కేసులు న‌మోదైనట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, 541 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. క‌రోనా నుంచి గత 24గంటల్లో 67,538 మంది కోలుకున్నారు. దేశంలో ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య‌ 3,32,918గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని పేర్కొంది ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 4,19,10,984 మంది కోలుకున్నారని తెలిపింది. దేశంలో మొత్తం 174,24,36,288 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వేశార‌ని వివ‌రించింది.

- Advertisement -