కొత్తగా 15,144 కరోనా‌ కేసులు నమోదు..

187
corona
- Advertisement -

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. తాజాగా దేశంలో గడిచిన 24గంటల్లో 15,144 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. వైరస్‌ నుంచి 17,170 మంది కోలుకోగా.. 181 మంది మృత్యువాత పడ్డారని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,57,985కు పెరిగింది. ప్రస్తుతం 2,08,826 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది.

ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,96,885 మంది కోలుకున్నారని.. 1,52,274 మంది మృత్యువాతపడ్డారని వివరించింది. ఇదిలా ఉండగా శనివారం 7,77,377 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చెప్పింది. ఇప్పటి వరకు 18.65కోట్లకుపైగా నమూనాలను పరిశీలించినట్లు వెల్లడించింది.

- Advertisement -