దేశంలో కొత్తగా 12,249 కరోనా కేసులు నమోదు..

79
india covid
- Advertisement -

గత కొద్దిరోజులుగా భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 12,249 కరోనా కేసులు నమోదైయ్యాయి.. ఈ కేసుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 74.5 శాతం ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 3659 (29.87 శాతం) కేసులు నమోదవగా, కేరళలో 2,609, ఢిల్లీలో 1,383, కర్ణాటకలో 738, తమిళనాడులో 737 చొప్పున కేసులు ఉన్నాయి.

దీంతో మొత్తం కేసులు 4,33,31,645కు చేరాయి. ఇందులో 4,27,25,055 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,903 మంది కరోనా రోగులు మృతిచెందారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం 81,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 13 మంది కరోనాకు బలవగా, 9,862 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 196.45 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

- Advertisement -