దేశంలో కొత్తగా 1,07,474 క‌రోనా కేసులు నమోదు..

88
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,07,474 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, గత 24గంటల్లో క‌రోనా నుంచి 2,13,246 మంది కోలుకున్నారని తెలిపింది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 865 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మర‌ణాల సంఖ్య‌ 5,01,979కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,69,46,26,697 డోసుల వ్యాక్సిన్లు వేశారు. క‌రోనాకు ప్ర‌స్తుతం 12,25,011 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.

- Advertisement -