దేశంలో కొత్త‌గా 10,853 క‌రోనా కేసులు న‌మోదు..

121
corona
- Advertisement -

దేశంలో కొత్త‌గా 10,853 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 3,43,55,536కు పెరిగాయి. అలాగే, 12,432 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనాతో గత 24 గంటల్లో 526 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,37,49,900 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల దేశంలో మొత్తం 4,60,791 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,44,845 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 28,40,174 డోసుల క‌రోనా వ్యాక్సిన్ వినియోగించారు. మొత్తం 1,08,21,66,365 డోసుల వ్యాక్సిన్లు వాడారు.

- Advertisement -