దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

81
- Advertisement -

దేశంలో మళ్లీ కరోనా భూతం విస్తరిస్తున్నట్లు కనిసిస్తోంది. రోజువారిగా భారీగా పాజిటీవ్ కేసులు పెరుగునతున్నాయి. కొత్తగా 17,336 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది. ఫిబ్రవరి తర్వాత ఒక రోజులో 17 వేల పైచిలుకు కేసులు రావడం ఇదే తొలిసారి. గడచిన 24 గంటల్లో 4 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం దేశంలో 88,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 4,33,62,294కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 13 మంది మరణించారు. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,24,954కు చేరుకుంది. రోజువారీ కేసుల్లో ఏకంగా 30 శాతం పెరుగుదల నమోదైంది. పాజిటివిటీ రేటు 4.32గా ఉంది. ఈ వారం మొత్తం పాజిటివిటీ రేటు 3.07గా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటిదాకా 196 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేసినట్టు కేంద్రం తెలిపింది. నిన్న ఒక్కరోజే 13.7 లక్షల మందికి టీకాలు అందించామని తెలిపింది.

- Advertisement -