భారత్‌లో కరోనా అప్‌డేట్‌..

109
- Advertisement -

దేశంలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. రోజువారి కేసులు భారీగా తగ్గాయి. కొత్త‌గా 6,561 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.. అలాగే, గత 24 గంటల్లో 142 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న క‌రోనా నుంచి 14,947 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,53,620గా ఉంద‌ని వివ‌రించింది.

క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా ఉంది. దేశంలో ప్ర‌స్తుతం 77,152 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో మొత్తం 178.02 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేసిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -