ఫైన‌ల్‌కు చేరిన భారత్..

460
india
- Advertisement -

మహిళల టీ-20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్స్ కు చేరింది. నేడు సిడ్నీలో ఇంగ్లండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ని భారత్ ఆడాల్సివుండగా, వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా,గ్రూప్ దశలో మెరుగైన పాయింట్లు కలిగివున్న కారణంగా ఇండియా ఫైనల్స్ కు క్వాలిఫై అయిందని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. గత టోర్నీ సెమీస్‌లో ఇండియాని ఇంటిబాట ప‌ట్టించిన ఇంగ్లండ్‌కి ఈ సారి నిరాశే ఎదురైంది.

గ్రూపు లీగులో అన్ని మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్ల‌తో భార‌త్ టాప్‌లో ఉండ‌గా, ఇంగ్లండ్ ఆరు పాయింట్ల‌కి ఆరు పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. దీంతో భార‌త్ నేరుగా ఫైన‌ల్‌కి చేరింది. దీంతో ద‌క్షిణాఫ్రికా (7), ఆస్ట్రేలియా(6)ల‌లో సౌతాఫ్రికాకే ఎక్కువ పాయింట్స్ ఉన్న క్ర‌మంలో సౌతాఫ్రికా నేరుగా ఫైన‌ల్స్‌కి చేరుతుంది. ఈ క్ర‌మంలో మార్చి 8న జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో భార‌త్‌, సౌతాఫ్రికాలు త‌ల‌ప‌డ‌నున్నాయి.

- Advertisement -