దేశంలో కొత్త‌గా 4,03,738 కరోనా కేసులు నమోదు..

147
corona
- Advertisement -

దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24గంటల్లో కొత్త‌గా 4,03,738 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… నిన్న 3,86,444 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 4,092 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,42,362కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు.37,36,648 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -