దేశంలో కొత్తగా 25,320 కరోనా కేసులు నమోదు..

190
corona
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. కొత్త వైరస్‌ కేసుల సంఖ్య మ‌ళ్లీ 25 వేలు దాటింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 25,320 మందికి కరోనా నిర్ధారణ అయింది. 16,637 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 161 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,607 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,89,897 మంది కోలుకున్నారు. 2,10,544 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,97,38,409 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -