దేశంలో కొత్త‌గా10,273 క‌రోనా కేసులు..

77
- Advertisement -

దేశంలో కరోనా కేసులు భారిగా తగ్గుతున్నాయి. కొత్త‌గా10,273 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 20,439 మంది కోలుకున్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో క‌రోనా వ‌ల్ల‌ 243 మంది ప్రాణాలు కోల్పోయారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి త‌గ్గిందని చెప్పింది.. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 4,22,90,921గా ఉందని తెలిపింది..
ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల‌ 5,13,724 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,11,472 మందికి చికిత్స అందుతోందని కేంద్రం వివ‌రించింది. మొత్తం 177,44,08,129 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

- Advertisement -