- Advertisement -
దేశంలో గడిచిన 24 గంటల్లో 36,083 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,92,576కు చేరింది. అలాగే నిన్న కరోనా నుంచి 37,927 మంది కోలుకున్నారు. ఇక మరణాల విషయానికొస్తే… గడిచిన 24 గంటల్లో 493 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,31,225 కు పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,76,015 మంది కోలుకున్నారు. 3,85,336 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. అలాగే, గడిచిన 24 గంటల్లో 73,50,553 వ్యాక్సిన్ డోసులు, ఇప్పటివరకు మొత్తం 54,38,46,290 డోసులు వేసినట్టు అధికారులు ప్రకటించారు.
- Advertisement -