దేశంలో పెరిగిన రికవరీ రేటు…

44
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 58,077 కరోనా కేసులు నమోదుకాగా 657 మంది మృతిచెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగింది. ఇక ఇప్పటివరకు 4,25,36,137 కరోనా కేసులు నమోదుకాగా 4,13,31,158 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,97,802 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,07,177 మంది మృతిచెందారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,71,79,51,432 కొవిడ్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -