దేశంలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

19
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 5880 కేసులు నమోదుకాగా 14 మంది మృతిచెందారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరాయి. కరోనాతో ఇప్పటివరకు 5,30,979 మంది మృతిచెందారు.

ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,96,318 మంది కోలుకోగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.08 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతంగా ఉండగా మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -